Pages

Monday, June 29, 2015

ఈ మహర్షి కధ... లోకానికి ఆదర్శం!!!

దేహ సౌందర్యం కన్నా మనః సౌందర్యం ముఖ్యం. ఎంత కష్టపడైనా సరే, తల్లిదండ్రులని సేవించుకోవాలి. ఈ ధర్మం పిల్లలకు తల్లిదండ్రులే నేర్పాలి... మాటలతో కాదు, చేతలతో...
తల్లిదండ్రుల సేవతో పునీతులైన వారు పురాణాలలో కోకొల్లలు. అందులో ఒకరు అష్ఠావక్రుడు. తండ్రి శాపానికి గురై 8 వంకరల దేహం తో పుట్టినా, ఆ తండ్రి మీద కోపం గానీ, ద్వేషం గానీ పెంపొందించుకోకుండా అదే తండ్రిని వరుణ దేవుని పాశాల నుండి రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చాడు. 12 సం వత్సరాలకే జనక మహారాజు ను ఓడించిన అపర మేధావి.
తండ్రి కహూడ మహర్షి శిష్యులతో అహోరాత్రులూ వేదాధ్యయనం చేయించేవాడు. ఆ వేదఘోషలూ, వేదార్థజ్ఞానమూ తల్లి గర్భంలో ఉండగానే విని పుట్టక ముందే సకల విజ్ఞానాన్నీ రంగరించాడు అష్టావక్రుడు.
ఒకరోజు రాత్రి తల్లి గర్భం నుంచే నుంచి తండ్రితో "తండ్రి, విశ్రాంతి లేకుండా చదువుతున్నందున నిద్ర మత్తులో శిష్యులు స్వరాలు తప్పు పలుకుతున్నారు." అన్నాడు. దానికి తండ్రి శిష్యుల ముందు అవమానించినందుకు అలోచనారహితంగా ఇంకా పుట్టని శిశువును అష్ట వంకర్లతో పుట్టు మని శపించాడు.
సంపదను ఆర్జించడానికి జనక మహారాజు వద్దకు వెళ్లాడు కుహూడుడు. అక్కడ వంది అనే ఆస్థాన పండితుడి చేతిలో ఓడి నీటిలో బలవంతంగా ముంచబడతాడు.
అష్టావక్రుడు మేనమామ దగ్గర సమస్త విద్యలూ అభ్యసిస్తాడు. 12 ఏళ్లకే మహా జ్ఞాని అయ్యి తన తండ్రి అన్వేషణ లో జనక మహారాజు రాజ్యానికి వచ్చి మహారాజు ను ఓడిస్తాడు.
జనకుడు 'బాల మహర్షి‘ అంటూ నమస్కరిస్తాడు, దాంతో వంది కూడా ఓటమి ని ఒప్పుకుంటూ, "నేను ఎవరినీ నీటిలో ముంచలేదు. మా నాన్నగారు వరుణ యాగం చేస్తున్నారు. దాని కోసం మహా పండితులు కావలసి వచ్చింది. యాగం పూర్తి అయ్యింది." అంటూ వరుణ దేవుడిని ప్రార్ధించి అష్టావక్రుడి తండ్రితో సహా అందరు పండితులనూ బయటకు రప్పించాడు.
దానితో తండ్రి సంతోషించి తన మంత్రశక్తిని సమంగా నదిలోకి ప్రవేశపెట్టి కుమారుడిని స్నానం చేయమనగా మహర్షి అష్టావక్రుడు ధగద్ధగాయమానమైన తేజస్సు తో బయటకు వచ్చాడు.
అష్టావక్రుడి జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు...
ఊకదంపుడు విద్యలు చేటు ను కలిగిస్తాయినీ...
జ్ఞానం తో కూడుకున్న సలహా చిన్నవారు చెప్పినా వినాలనీ...
ఆగ్రహంతో తీసుకున్న నిర్ణయాలు కీడు మాత్రమే చేస్తాయనీ...
ఏ సంఘటనైనా తాత్కాళికంగా బాధ కలిగించినా నిగ్రహవంతునికి, జ్ఞానికీ మేలే జరుగుతుందనీ తెలుసుకోవచ్చు.